మావోయిస్టు కేంద్ర కమిటీ పేరుతో ప్రకటన విడుదల
ABN , First Publish Date - 2020-09-04T01:46:06+05:30 IST
మావోయిస్టు కేంద్ర కమిటీ పేరుతో ప్రకటన విడుదల

హైదరాబాద్: మావోయిస్టు కేంద్ర కమిటీ పేరుతో ప్రకటన విడుదలైంది. గణపతి లొంగుబాటు పోలీసుల కట్టు కథ అని ఆరోపించారు. మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలు కలిసి తయారు చేసిన కట్టుకథ అని మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేర్కొన్నారు. అనారోగ్యంతోనే గణపతి స్వచ్చందంగా పదవి నుంచి తప్పుకున్నారని చెప్పారు. తమ పార్టీ నాయకత్వం ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే పోలీసులు కట్టుకథలు అల్లుతున్నారని పేర్కొన్నారు.