సామూహిక ప్రార్థనలు.. పాస్టర్పై కేసు!
ABN , First Publish Date - 2020-04-14T09:04:56+05:30 IST
కేపీహెచ్బీ కాలనీలోని లార్డ్ గ్రేస్ చర్చిలో ఈస్టర్ క్రిస్టియన్ ఫెస్టివల్లో భాగంగా ఆదివారం సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.
![సామూహిక ప్రార్థనలు.. పాస్టర్పై కేసు!](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదర్నగర్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): కేపీహెచ్బీ కాలనీలోని లార్డ్ గ్రేస్ చర్చిలో ఈస్టర్ క్రిస్టియన్ ఫెస్టివల్లో భాగంగా ఆదివారం సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ చర్చిలో సుమారు 20-25మంది ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు కేపీహెచ్బీ పెట్రోల్ మొబైల్ సిబ్బంది గుర్తించి పాస్టర్ జార్జిపై కేసు నమోదు చేశారు.