పెళ్లిళ్లు వాయిదా
ABN , First Publish Date - 2020-03-23T09:15:00+05:30 IST
జనతా కర్ఫ్యూతో రాష్ట్రంలో పెళ్లిళ్లు వాయిదాపడ్డాయి. ఇంకొందరు ముహూర్తానికి ఒక రోజు ముందు శనివారమే వివాహం జరిపించారు. శుక్రవారం పెళ్లయి.. ఆదివారం

కొన్ని ముహూర్తానికి ముందే
నల్లగొండ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): జనతా కర్ఫ్యూతో రాష్ట్రంలో పెళ్లిళ్లు వాయిదాపడ్డాయి. ఇంకొందరు ముహూర్తానికి ఒక రోజు ముందు శనివారమే వివాహం జరిపించారు. శుక్రవారం పెళ్లయి.. ఆదివారం ఏర్పాటు చేసుకున్న రిసెప్షన్ వాయిదా వేసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించిన వధూవరులను, పెళ్లి పెద్దలను పలువురు అభినందించారు. జనతా కర్ఫ్యూ గురించి అధికారులు వెళ్లి వివరించడంతో పెద్దపల్లి జిల్లా ముత్తారంలో ఆదివారం జరగాల్సిన పెళ్లిని సోమవారానికి వాయిదా వేయడానికి వధూవరుల తల్లిదండ్రులు అంగీకరించారు.
నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఆదివారం జరగాల్సిన పెళ్లిని ఆర్భాటంలేకుండా శనివారమే జరిపించారు. ఇదిలా ఉండగా ఒకటిరెండు చోట్ల జనతా కర్ఫ్యూలోనూ పెళ్లిళ్లు ఆగలేదు. ఫంక్షన్ హాల్ మూతపడడంతో మహబూబాబాద్ జిల్లా కే.సముద్రం మండలం అమినాపురంలో ఇంట్లోనే మండపం ఏర్పాటు చేసి పెళ్లి చేశారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్లో మండలం తిగుల్ నర్సాపూర్లోనూ ఓ పెళ్లి జరిగింది. కేవలం 50 మందే హాజరయ్యారు.