అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2020-12-30T16:18:40+05:30 IST
తెలంగాణకు ఇండికా కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని సీలేరు పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్: విశాఖ ఏజెన్సీ జీకేవీధి మండలం, ధారకొండ నుంచి తెలంగాణకు ఇండికా కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని సీలేరు పోలీసులు పట్టుకున్నారు. 16 కేజీల శీలవతి గంజాయి ప్యాకెట్లు, ఇండికా కారును, తెలంగాణ.. హయత్నగర్కు చెందిన కంచుల శ్రీను(48), అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.