అమ్ముడుపోయిన మందకృష్ణ: పిడమర్తి

ABN , First Publish Date - 2020-10-01T07:18:05+05:30 IST

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఇంప్లీడ్‌ అవ్వాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ డిమాండ్‌ చేస్తున్నారని, ఆయన మాటలు పట్టించుకుంటే....

అమ్ముడుపోయిన మందకృష్ణ: పిడమర్తి

హైదరాబాద్‌, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఇంప్లీడ్‌ అవ్వాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ డిమాండ్‌ చేస్తున్నారని, ఆయన మాటలు పట్టించుకుంటే వర్గీకరణ మరింత ఆలస్యం అవుతుందని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. మంద కృష్ణ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. ఆయన మాల మహానాడు సంఘానికి అమ్ముడుపోయారని స్పష్టం అవుతోందన్నారు. బుధవారం బోడుప్పల్‌లో మాదిగ సంఘాల జేఏసీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ కోసం గతంలో సుప్రీం కోర్టు న్యాయవాదులకు ఫీజుల పేరుతో రూ.100 కోట్ల చందాలు మంద కృష్ణ వసూలు చేశారని, ఇప్పుడు మళ్లీ ఇంటికి రూపాయి నుంచి రూ.లక్ష వరకు చందాలు ఇవ్వాలని కొత్త దందా మొదలు పెట్టారని ఆరోపించారు. 

Updated Date - 2020-10-01T07:18:05+05:30 IST