ఉద్యోగుల సర్వీసును పెంచొద్దు: మానవతారాయ్
ABN , First Publish Date - 2020-06-06T08:41:01+05:30 IST
గెజిటెడ్ ఉద్యోగుల సర్వీసు పొడగింపును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ..
మంగళ్హాట్: గెజిటెడ్ ఉద్యోగుల సర్వీసు పొడగింపును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ అన్నారు. కొందరు వ్యక్తుల కోసమే ఈ పొడగింపు నిర్ణయం తీసుకున్నారని, ఇది అక్రమమని తెలిపారు. ఇలా ఉద్యోగుల సర్వీసులు పొడగించుకుంటూ వెళ్తే నిరుద్యోగుల పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ అమరవీరుల స్తూపాన్ని తాకడం వల్ల అది అపవిత్రమైందంటూ గన్పార్క్లోని స్తూపాన్ని మంగళవారం పసుపు నీళ్లతో శుద్ధి చేశారు.
ఉద్యోగ విరమణ వయసు పెంపు అందరికీ వర్తింపజేయాలి: టీఎ్సయూటీఎఫ్
ఉద్యోగ విరమణ వయసు పెంపును అందరికీ వర్తింపజేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎ్సయూటీఎఫ్) డిమాండ్ చేసింది. పదవీ విరమణ వయసును కొందరికే రెండేళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని పేర్కొంది.