మహబూబాబాద్లో సెల్టవర్ ఎక్కి రైతుల నిరసన
ABN , First Publish Date - 2020-10-19T17:15:54+05:30 IST
మొక్కజొన్న సాగును ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని బయ్యారం మండలం కస్తూరినగరంలో పదిమంది రైతులు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు.

మహబూబాబాద్: మొక్కజొన్న సాగును ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని బయ్యారం మండలం కస్తూరినగరంలో పదిమంది రైతులు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. మొక్కజొన్న పంటసాగుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, పోడు చేసుకున్న భూములకు పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు దిగారు.