మహబూబాబాద్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2020-10-07T14:55:59+05:30 IST

జిల్లాలోని నెల్లికుదురు మండలం రాజుల కొత్తపల్లి గ్రామంలో సందీప్ రెడ్డి అనేవ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

మహబూబాబాద్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి

మహబూబాబాద్: జిల్లాలోని నెల్లికుదురు మండలం రాజుల కొత్తపల్లి గ్రామంలో సందీప్ రెడ్డి అనేవ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సందీప్‌‌ను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి గాయపర్చి ఉరివేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. మృతుడి ఒంటిపై గాయాలు ఉండడంతో కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-10-07T14:55:59+05:30 IST