4 రోజుల తర్వాత ఇవాళే అన్నం తిన్నాం: వలస కూలీల ఆవేదన
ABN , First Publish Date - 2020-03-30T19:05:30+05:30 IST
సంగారెడ్డి: లాక్డౌన్ కారణంగా వలస కూలీల పరిస్థితి దారుణంగా మారింది. తినడానికి తిండి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
![4 రోజుల తర్వాత ఇవాళే అన్నం తిన్నాం: వలస కూలీల ఆవేదన](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సంగారెడ్డి: లాక్డౌన్ కారణంగా వలస కూలీల పరిస్థితి దారుణంగా మారింది. తినడానికి తిండి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఎలాగైనా సొంతూరుకు వెళ్లాలని వందల కిలో మీటర్లను సైతం లెక్క చేయక పిల్లలతో కలిసి నడక సాగిస్తున్నారు. పటాన్ చెరు మండలం ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై బెంగళూరు నుంచి వలస కూలీలు నడుచుకుంటూ తమ సొంతూరుకి వెళుతున్నారు.
మహారాష్ట్రలోని నాగపూర్ వెళ్లేందుకు తాము ఐదు రోజులుగా నడుస్తున్నామని సదరు కూలీలు చెబుతున్నారు. కరోనా ఎఫెక్ట్తో తిండి కూడా దొరక లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై స్థానికులు వారికి భోజనాలు పెట్టారు. దీంతో తాము నాలుగు రోజుల తరువాత ఇవాళే అన్నం తిన్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.