రేపే జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితా విడుదల
ABN , First Publish Date - 2020-11-13T03:07:22+05:30 IST
రేపే(శుక్రవారం) జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఎల్లుండి తర్వాత ఏ క్షణమైనా జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. దీపావళి తర్వాత షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు
హైదరాబాద్: రేపే(శుక్రవారం) జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఎల్లుండి తర్వాత ఏ క్షణమైనా జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. దీపావళి తర్వాత షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. నోటిఫికేషన్ విడుదలైన 15 రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచే ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది. 2016 ఎన్నికల్లో నిర్ణయించిన వార్డుల రిజర్వేషన్లే కొనసాగుతాయని ఎన్నికల కమిషనర్ పార్థసారథి స్పష్టం చేశారు.