ఇక నుంచి ఆన్లైన్లోనే పురుగు మందుల తయారీ, విక్రయ లైసెన్స్లు
ABN , First Publish Date - 2020-12-19T07:41:03+05:30 IST
ఆన్లైన్ ద్వారా పురుగుమందుల తయారీ, అమ్మకపు లైసెన్స్లను జారీ చేసే విధానాన్ని శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ

ఆన్లైన్ ద్వారా పురుగుమందుల తయారీ, అమ్మకపు లైసెన్స్లను జారీ చేసే విధానాన్ని శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ ముఖ్యకార్యదర్శి బి.జనార్దన్రెడ్డి ప్రారంభించారు. ఆన్లైన్ విధానానికి పోర్టల్ను రూపొందించిన ఎన్ఐసీ సిబ్బంది, నిపుణులను ఆయన అభినందించారు.
www.olms.telangana.gov.in పోర్టల్ ద్వారా పురుగు మందుల తయారీ లైసెన్స్, అమ్మకపు లైసెన్స్ పొందడంతోపాటు వాటి పునరుద్ధరణ, సవరణలు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.