కూసుమంచి ఎంపీవోపై సస్పెన్షన్ వేటు
ABN , First Publish Date - 2020-02-17T10:55:04+05:30 IST
గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ల కొనుగోలులో ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక అందించిన ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పంచాయతీ అధికారి(ఎంపీవో)
కూసుమంచి: గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ల కొనుగోలులో ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక అందించిన ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పంచాయతీ అధికారి(ఎంపీవో) వీరాస్వామిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల అన్ని గ్రామపంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ, హరితహారం, ఇతరత్రా నిర్వహణ కు పాలకవర్గాల చేత రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్ల కొనుగోలు చేయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మండలంలో 40 పంచాయతీలుండగా, ఇప్పటి వరకు 11 జీపీల్లో మాత్రమే ట్రాక్టర్ల కొనుగోళ్లు జరిగాయి. కాగా, ఎంపీవో అన్ని జీపీల్లో నూరుశాతం ట్రాక్టర్ల కొనుగోలు చేశామంటూ తప్పుడు నివేదిక ఇవ్వడంతో.. ఆగ్రహించిన కలెక్టర్ ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.