అంబులెన్స్లను ప్రారంభించిన కేటీఆర్
ABN , First Publish Date - 2020-10-04T09:36:47+05:30 IST
‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు అందించిన అంబులెన్స్లను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు.
హన్మకొండ టౌన్, అక్టోబరు 3: ‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు అందించిన అంబులెన్స్లను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. కేటీఆర్ పిలుపు మేరకు ఇద్దరు మంత్రులతో పాటు వరంగల్కు చెందిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల కోసం అంబులెన్స్లు అందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం వరంగల్ పశ్చిమ, తూర్పు, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్ సమకూర్చిన అంబులెన్స్లను కేటీఆర్ హైదరాబాద్లో ప్రారంభించారు. ఈసందర్భంగా వీరిని కేటీఆర్ అభినందించారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ఎంపీ కవిత తదితరులు పాల్గొన్నారు.