ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మున్సిపల్ చైర్మన్లకు మంత్రి కేటీఆర్ లేఖ
ABN , First Publish Date - 2020-05-18T01:04:33+05:30 IST
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మున్సిపల్ చైర్మన్లకు మంత్రి కేటీఆర్ లేఖ

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మున్సిపల్ చైర్మన్లకు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ప్రతి ఆదివారం 10 గంటల 10 నిమిషాల కార్యక్రమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. సీజనల్ వ్యాధులను కలిసికట్టుగా ఎదుర్కొందామని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని మంత్రి కేటీఆర్ తెలిపారు.