నేటి నుంచి గ్రేటర్లో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం
ABN , First Publish Date - 2020-11-21T14:16:17+05:30 IST
మంత్రి కేటీఆర్ శనివారం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

హైదరాబాద్: గ్రేటర్లో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక ఎన్నికల ప్రచారం జోరందుకోనుంది. మంత్రి కేటీఆర్ శనివారం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కూకట్పల్లి నుంచి రోడ్షోను ప్రారంభించనున్నారు. కాగా ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారాలు మొదలు పెట్టాయి. మంత్రి కేటీఆర్ రోడ్షోలు ఖరారయ్యాయి. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రోడ్షోలు నిర్వహించనున్నారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్లో మంత్రి ప్రచారం చేయనున్నారు. ఆదివారం.. మహేశ్వరం, ఎల్బీనగర్లో కేటీఆర్ రోడ్షోలు నిర్వహించనున్నారు.
టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్స్ వీరే...
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్స్ను అధిష్టానం ప్రకటించింది. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్రావు, తలసాని, ఈటల, మంత్రులు సత్యవతి, సబితా, మహమూద్అలీ, కొప్పుల, పువ్వాడ అజయ్ పేర్లను హైకమాండ్ వెల్లడించింది.