కేటీఎమ్ షోరూమ్లోకి చొరబడ్డ దొంగలు
ABN , First Publish Date - 2020-03-12T16:48:28+05:30 IST
మెహిదీపట్నంలో మరోసారి దొంగలు బీభత్సం సృష్టించారు. మెహిదీపట్నం సమీపంలోని రింగ్ రోడ్డులో కేటీఎమ్ షోరూమ్లో దుండగులు ...
![కేటీఎమ్ షోరూమ్లోకి చొరబడ్డ దొంగలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్: మెహిదీపట్నంలో మరోసారి దొంగలు బీభత్సం సృష్టించారు. మెహిదీపట్నం సమీపంలోని రింగ్ రోడ్డులో కేటీఎమ్ షోరూమ్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. షోరూమ్ షెట్టర్ బద్డలు తాళాలు కొట్టారు. అనంతరం దొంగలు షోరూమ్ నుంచి రెండు బైక్లను అపహరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.