కొవిడ్‌ టీకాను పకడ్బందీగా అమలు చేయాలి

ABN , First Publish Date - 2020-12-31T04:37:11+05:30 IST

కొవిడ్‌ టీకాను పకడ్బందీగా అమలు చేయాలి

కొవిడ్‌ టీకాను పకడ్బందీగా అమలు చేయాలి
జడ్పీలో కోఆర్డినేషన్‌ మీటింగ్‌లో పాల్గొన్న చైర్‌పర్సన్‌, అధికారులు

జిల్లా కోఆర్డినేషన్‌ సమావేశంలో నిర్ణయం

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, డిసెంబరు 30: జిల్లాలో కొవిడ్‌-19 టీకా కార్యక్రమాన్ని ఫ్రంట్‌లైన్‌ వర్కర్లందరికి పకడ్బందీ ప్రణాళికతో అమలు చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి అన్నారు. కొవిడ్‌-19 టీకాపై జిల్లా కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అపోహలకు తావులేకుండా ప్రచారం చేయాలన్నారు. అలాగే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఆర్‌.మహేందర్‌రెడ్డి, జడ్పీ సీఈవో రాజారావు, జిల్లా వైద్యశాఖ అధికారి చల్లా మధుసూదన్‌, ప్రోగ్రాం అధికారులు డాక్టర్లు ప్రకాష్‌, గోపాల్‌రావు, విపిన్‌కుమార్‌, ఎన్పీడీసీఎల్‌ ఏడీ రాజు, డీఆర్‌డీవో ఏవో ప్రభాకర్‌రెడ్డి, యూనిసెఫ్‌ ఎస్‌ఎంవో ప్రశాంత్‌, విద్యాసాగర్‌, కేవీరాజు, విద్యాసాగర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T04:37:11+05:30 IST