కొవిడ్‌ నిజాలు నిగ్గు తేలుతాయ్‌!

ABN , First Publish Date - 2020-06-26T08:05:04+05:30 IST

రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి

కొవిడ్‌ నిజాలు నిగ్గు తేలుతాయ్‌!

బీజేపీ రాష్ట్ర నేతల ఆశాభావం

హైదరాబాద్‌, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ నేతృత్వంలో రానున్న బృందం ఇక్కడ వాస్తవ పరిస్థితిని నిగ్గుతేల్చనుందని బీజేపీ రాష్ట్ర నేతలు పేర్కొంటున్నారు. కరోనా బాధితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఉదాహరణలతో సహా కేంద్రానికి పార్టీ నేతలు నివేదికలు అందజేశారు. మరోవైపు కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. తొలిసారి కరోనాపై అధ్యయనానికి వచ్చిన కేంద్రబృందం.. స్థానిక యంత్రాంగం మాయలో పడిపోయిందని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు పేర్కొన్నా రు. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకే లవ్‌ అగర్వాల్‌ను కేంద్రం, ఇక్కడకు పంపిస్తోందని తెలిపారు. కరోనా పరీక్షలపై నిజాలు నిగ్గుతేలుతాయని మరో సీనియర్‌ నేత అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2020-06-26T08:05:04+05:30 IST