సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై భూకబ్జా ఆరోపణలు
ABN , First Publish Date - 2020-04-21T18:26:00+05:30 IST
కుమ్రంభీం: సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కుమ్రంభీం: సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగజ్నగర్ 147 సర్వే నంబర్లో రూ.4 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని.. ఎమ్మెల్యే కోనప్ప కబ్జా చేశారని హెచ్ఆర్సీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. వివాదాస్పద స్థలంలో నిర్మాణాలు నిలిపివేతతో పాటు.. విచారణకు హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 29కి హెచ్ఆర్సీ వాయిదా వేసింది. కోనప్పపై విచారణ జరిపిస్తే తమ ఆరోపణలను నిరూపిస్తా కాంగ్రెస్ నేత పాల్వాయి హరీష్బాబు వెల్లడించారు.