కోదండరాం రాజకీయాలకు పనికి రారు!
ABN , First Publish Date - 2020-09-29T08:10:10+05:30 IST
టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం రాజకీయాలకు పనికి రారని, పార్టీని వేరే వారికి అప్పజెప్పాలని ఆ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు వెదిరె చల్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయనకు నాయకులను తయారు చేసే శక్తి మాత్రమే ఉందని, పార్టీని నడిపే సామర్థ్యం లేదన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో
పంజాగుట్ట, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం రాజకీయాలకు పనికి రారని, పార్టీని వేరే వారికి అప్పజెప్పాలని ఆ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు వెదిరె చల్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయనకు నాయకులను తయారు చేసే శక్తి మాత్రమే ఉందని, పార్టీని నడిపే సామర్థ్యం లేదన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాంను ఆయుధంగా ఉపయోగించుకుని కేసీఆర్ గెలిచారని పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నాయకులతో కలిసి చల్మారెడ్డి తెలంగాణ ఇంటి పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఎమ్మెల్సీగా పోటీ చేసే విషయాన్ని కోదండరాం పునరాలోచించి, తనకు మద్దతు తెలపాలని చెరుకు సుధాకర్ విజ్ఞప్తి చేశారు.