బీజేపీ నేతలపై పోలీసులతో దాడులా?

ABN , First Publish Date - 2020-10-27T09:12:54+05:30 IST

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ఇంత దుర్మార్గంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని తాను ఎన్నడూ చూడలేదని

బీజేపీ నేతలపై పోలీసులతో దాడులా?

కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం: కిషన్‌ రెడ్డి 


సిద్దిపేట టౌన్‌, అక్టోబరు 26: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ఇంత దుర్మార్గంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని తాను ఎన్నడూ చూడలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఇతర నాయకులపై పోలీసులతో రాష్ట్ర ప్రభుత్వం దాడి చేయిస్తోందని, ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సోమవారం సిద్దిపేటలో దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బందువుల ఇంట్లో సోదాలు జరగడంతో సిద్దిపేటకు కిషన్‌ రెడ్డి వచ్చారు. సోదాలు జరిగిన క్రమాన్ని ఆయనకు రఘునందన్‌ వివరించారు. అనంతరం కిషన్‌రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అభ్యర్థికి ప్రచారం చేసుకునే హక్కును భారత రాజ్యంగం కల్పించిందని, అలాంటిది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇంతలా వేధించడం సరైందికాదన్నారు. టీఆర్‌ఎ్‌సపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అందరూ బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు.  

Updated Date - 2020-10-27T09:12:54+05:30 IST