‘సోమవారం నుంచి మరింత కఠినతరం కానున్న లాక్డౌన్ నిబంధనలు’
ABN , First Publish Date - 2020-03-30T03:46:55+05:30 IST
సోమవారం నుంచి లాక్డౌన్ నిబంధనలు కఠినతరం చేయబోతున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోవాలని.. ..
హైదరాబాద్: సోమవారం నుంచి లాక్డౌన్ నిబంధనలు కఠినతరం చేయబోతున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోవాలని.. సొంతూళ్లకు వెళ్లడానికి వీల్లేదని ఆయన తెలిపారు. ఇప్పటికే కలెక్టర్లు, ఎస్సీలకు కేంద్రం ఆదేశాలిచ్చిందని చెప్పారు. గోవా, గుజరాత్ మినహా ఏ రాష్ట్రంలోనూ కేంద్ర బలగాలు మోహరించలేదన్నారు. రాష్ట్రాలు కేంద్ర బలగాలు కోరితే పంపడానికి సిద్ధమని కిషన్రెడ్డి స్పష్టం చేశారు.