బీజేపీలోకి విజయశాంతి రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్

ABN , First Publish Date - 2020-10-28T02:58:44+05:30 IST

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. దుబ్బాకలో

బీజేపీలోకి విజయశాంతి రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. దుబ్బాకలో హాట్‌హాట్‌గా ఉప ఎన్నికల ప్రచారపర్వం జరుగుతున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయమని పిలుపు ఇవ్వలేదు. దీంతో రాములమ్మ కాంగ్రెస్‌కు దూరం కానున్నట్లు ప్రచారం జరిగింది. అన్నట్టుగానే ఆమె త్వరలో కమలం గూటికి చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. 


ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు అరగంట పాటు ఈ భేటీ జరిగినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఈ సమావేశానికి కొద్ది రోజుల కిందట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా విజయశాంతితో భేటీ అయినట్లు సమాచారం. నవంబర్ 10 లోపు ముహూర్తం చూసుకుని రాములమ్మ బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఢిల్లీ పెద్దల సమక్షంలో విజయశాంతి కమలం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-10-28T02:58:44+05:30 IST