వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్కు లేదు: జీవన్రెడ్డి
ABN , First Publish Date - 2020-06-07T19:57:00+05:30 IST
ప్రైవేటు విత్తన కంపెనీలకు సీఎం కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్గా మారారని, వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక అర్హత ఆయనకు లేదని కాంగ్రెస్ నేత జీవన్రెడ్డి చెప్పారు.
కరీంనగర్: ప్రైవేటు విత్తన కంపెనీలకు సీఎం కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్గా మారారని, వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక అర్హత ఆయనకు లేదని కాంగ్రెస్ నేత జీవన్రెడ్డి చెప్పారు. నియంత్రిత సాగు దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. నియంత్రిత వ్యవసాయం పేరుతో నిర్బంధ వ్యవసాయం సరికాదని హితవుపలికారు. మద్దతు ధర విషయంలో కేంద్రం రైతాంగాన్ని నిరాశ పరిచిందని జీవన్రెడ్డి ఆరోపించారు.