కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు

ABN , First Publish Date - 2020-03-25T01:01:37+05:30 IST

కరోనా కట్టడికి కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 32 మంది‌కి వైరస్ అంటుకుందని...

కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు

హైదరాబాద్: కరోనా కట్టడికి కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 32 మంది‌కి వైరస్ అంటుకుందని ఆయన తెలిపారు. 23 రాష్ట్రాలు లాక్ డౌన్ అయ్యాయని.. అంతర్ రాష్ట్ర సరిహద్దులు మూసి వేశారని చెప్పారు. కరోనా లక్షణాలున్న  అనుమానితులను హైదరాబాద్‌లో పరీక్షించి ..పాజిటివ్ వస్తే ఇక్కడే చికిత్స అందిస్తున్నామన్నారు. రష్యా‌లో స్ట్రిక్ట్‌గా ఉన్నారని.. హైరిస్క్ తీసుకున్నారు కాబట్టి..ఒక్క కేసు పాజిటివ్ లేదని చెప్పారు.


అత్యంత శక్తి వంతమైన అమెరికాలోనే 50 వేల మంది కరోనా బారిన పడ్డారని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలిపారు. కరోనా వైరస్  తగిలిచుకుంటే తప్ప...దాని అంతటా వచ్చే వ్యాధి కాదని ఆయన స్పష్టం చేశారు. గుంపులుగా ఉండకుండా చూడాలని.. జిల్లా యంత్రాంగం చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలని కోరారు. రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు ఏ ఒక్క వ్యక్తి కూడా బయటకి రావద్దన్నారు. అన్నీ నిత్యావసర సరుకుల దుకాణాలు సాయంత్రం 6 గంటల వరకు మూసి వేయాలని సూచించారు. మాట వినకపోతే సీజ్ చేసి.. మూసి వేయాలని కలెక్టర్‌కు  సీఎం కేసీఆర్ సూచించారు. 


‘‘రాష్ట్రాన్ని కాపాడుకునే క్రమంలో పౌర బాధ్యతలను పాటించాలి. ఎవ్వరికీ మినహాయింపు లేదు. రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా కఠినమైన నిబంధనలను పాటించక తప్పదు. ప్రైవేటు కార్మికులకు ఈ నెల మొత్తం వేతనం ఇవ్వాల్సిందిగా కలెక్టర్‌లు ఆదేశాలు ఇవ్వండి. వ్యవసాయ శాఖకు సంబంధించిన పనులకు అంతరాయం కలిగించొద్దు. జనం గుంపు గుంపులుగా ఉండొద్దు. ఎమర్జెన్సీ అవసరల పట్ల పోలీస్‌లు జాగ్రత్తగా వ్యవహరించండి. శానిటేషన్ రెగులర్‌గా జరగాలి.  గ్రామ, పట్టణ పరిశ్యుద్ధం బాగా ఉండాలి. ప్రతి రోజు ప్రతి ఊరు శుభ్రంగా ఉండాలి.


జిల్లా  హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారి  లిస్ట్ దగ్గర పెట్టుకోవాలి. కలెక్టర్‌లు  జిల్లా లోని అన్నీ ఆసుపత్రిలను విజిట్ చేయాలి. పోలీస్ సిబ్బంది సంఖ్యని బట్టి డ్యూటీలు వేయాలి. సామాజిక స్పృహ ఉన్న వారిని కంట్రోల్ రూమ్‌లో పెట్టండి. ప్రజలతో మంచిగా మాట్లాడాలి.’’అని కేసీఆర్ తెలిపారు. 


‘‘ నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదంలో పడతాం.  ప్రజాస్వామ్య దేశం కాబట్టి స్మూత్‌గా చెబుతున్నాం. మాట వినకపోతే కఠినంగా వ్యవహరించక తప్పదు.  రాష్ట్రాన్ని రక్షించుకునే దిశలో ఏ నిర్ణయం అయినా తీసుకునే పరిస్థితి వస్తుంది. మాట వినకపోతే 24 గంటల కర్ఫ్యూ తప్పదు. అదీ కూడా వినకపోతే షూట్ అండ్ సైట్. ఆర్మీ‌ని దింపడం తప్పదు. సాటి మనుషులకు..సమాజానికి ఇబ్బందులు వచ్చేలా ప్రవర్తిస్తే వారికి ఉన్న అన్నీ లైసెన్సులు రద్దు చేయబడతాయి. హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారి పాస్ పోర్టులు కలెక్టరేట్‌లో పెట్టుకోవాలి. దేశంలో 40 మంది చనిపోయారు. అదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఎవరిని వెంటిలేటర్‌ల మీద పెట్టాల్సిన క్రిటికల్ పరిస్థితి లేదు.’’ అని సీఎం అన్నారు. 




Updated Date - 2020-03-25T01:01:37+05:30 IST