కరీంనగర్‌లో సర్వే...ప్రశ్నించిన జైపాల్‌రెడ్డి అరెస్ట్

ABN , First Publish Date - 2020-05-09T19:06:11+05:30 IST

కరీంనగర్‌లో సర్వే...ప్రశ్నించిన జైపాల్‌రెడ్డి అరెస్ట్

కరీంనగర్‌లో సర్వే...ప్రశ్నించిన జైపాల్‌రెడ్డి అరెస్ట్

కరీంనగర్: జిల్లాలోని గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి  గ్రామంలో నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు.  విషయం తెలిసిన గంగాధర మాజీ సింగిల్ విండో ఛైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి అక్కడకు చేరుకుని అధికారులను ప్రశ్నించారు.  వెంటనే ఆయనపై ఎమ్మార్వో కొమల్ ‌రెడ్డి గంగాధర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు జైపాల్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. మరోవైపు జైపాల్‌రెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ ఆయన అనుచరులు పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చారు. స్టేషన్ ముందు రాస్తారోకో నిర్వహించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

Updated Date - 2020-05-09T19:06:11+05:30 IST