కరీంనగర్లో మూడు రోజుల పాటు దుకాణాల బంద్
ABN , First Publish Date - 2020-07-10T16:21:31+05:30 IST
కరీంనగర్: నగరంలో మూడు రోజుల పాటు దుకాణాలు బంద్ కానున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాపారులు స్వచ్చందంగా..

కరీంనగర్: నగరంలో మూడు రోజుల పాటు దుకాణాలు బంద్ కానున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాపారులు స్వచ్చందంగా బంద్ చేయాలని నిర్ణయానికి వచ్చారు. లాక్డౌన్ ఉంటుందని ఇప్పటి వరకూ భావిస్తూ వచ్చిన వ్యాపారులు ఇప్పుడిక అది ఉండదని నిర్ధారణ కావడంతో స్వచ్చంద బంద్కు పూనుకున్నారు. మరోవైపు స్థానిక క్లాక్ టవర్ సర్కిల్ను అధికారులు శానిటైజ్ చేయనున్నారు.