కామారెడ్డి జిల్లాలో చిరుత కలకలం
ABN , First Publish Date - 2020-12-13T15:59:28+05:30 IST
కామారెడ్డి జిల్లాలో చిరుత కలకలం

కామారెడ్డి: జిల్లాలోని గాంధారి లింగంపేట శివారులో చిరుత సంచారం కలకలం రేగింది. పులిని చూసిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న అటవీ అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు. చిరుతను బంధించడానికి అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనవసరంగా స్థానికులు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. బయటకు వెళ్తే ఏమౌతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.