కాళేశ్వరంలో శని త్రయోదశి పూజలు
ABN , First Publish Date - 2020-12-13T04:54:16+05:30 IST
కాళేశ్వరంలో శని త్రయోదశి పూజలు
మహదేవపూర్, డిసెంబరు 12: మండలంలోని కాళేశ్వర ముక్తీ శ్వర స్వామి ఆలయంలో శనివారం శని త్రయోదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. కాళేశ్వర ఆలయంలో శని పూజలు నిర్వహిస్తే విద్య, వైద్య, వైవాహిక, వ్యాపా రాది విషయాల్లో శుభం కలుగుతుందని నమ్మకం. త్రయోదశితో కూడిన శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శని పూజలు నిర్వహించుకున్నారు. త్రివేణి సంగమ గోదావరిలో స్నానాలు ఆచరించిన అనం త రం స్వావివారిని దర్శించుకున్నారు. కార్తీక మాసంలోని ఆఖరి శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో ఆలయంలో పూజలు నిర్వహించారు. శనివారం 200 అభిషేకాలు, 150 కాల సర్పదోష నివారణ పూజలు, 150 కుంకుమార్చనలు, 548 శనిపూజా టికె ట్లు విక్రయించినట్టు అధికారులు వెల్లడించారు. ఆలయానికి రూ. 4.05 లక్షల ఆదా యం సమకూరిందని తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న ఆర్టీఐ కమిషనర్
కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ఆర్టీఐ కమిషనర్ శంకర్ నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం కమిషనర్ను అర్చకులు సన్మానించారు. ఆయన వెంట ఎస్సై నరహరి తదితరులున్నారు.
వెండి చెంబుల బహూకరణ
కాళేశ్వరంలోని శుభానందా దేవి అమ్మవారి ఆలయానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ రమణారెడ్డి దంపతులు రూ. 30వేల విలువైన నాలుగు వెండి చెంబులను బహూకరించారు అర్చకు లు ఎస్ఈ దంపతులను సన్మానించారు.