ప్రతి నెలా రెండు జిల్లాల్లో ‘జన అదాలత్’
ABN , First Publish Date - 2020-11-19T08:49:19+05:30 IST
కేసుల పరిష్కారానికి జిల్లాల ప్రజలు హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేకుండా జిల్లాల్లోనే పరిష్కారం లభించే విధంగా ‘
![ప్రతి నెలా రెండు జిల్లాల్లో ‘జన అదాలత్’](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఎర్రోళ్ల
హైదరాబాద్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): కేసుల పరిష్కారానికి జిల్లాల ప్రజలు హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేకుండా జిల్లాల్లోనే పరిష్కారం లభించే విధంగా ‘జన అదాలత్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు.
ప్రతి నెలా రెండు జిల్లాల్లో.. కమిషన్ రెండు రోజులపాటు పర్యటిస్తుందని చెప్పారు. తొలుతగా జన అదాలత్ను ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు.