బీజేపీకి డెడ్లైన్లు పెడతాం: జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2020-12-19T18:36:28+05:30 IST
బండి సంజయ్ ప్రజా సమస్యలపై మాట్లాడకుండా.. యువతను రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

సంగారెడ్డి: బండి సంజయ్ ప్రజా సమస్యలపై మాట్లాడకుండా.. యువతను రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. పేదల అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పి.. బీజేపీ అధికారంలోకి వచ్చిందని మాట తప్పారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రధానిని సంజయ్ ప్రశ్నిస్తారా అని సవాల్ విసిరారు. ధరల పెరుగుదలపై సంజయ్ సమాధానం చెబుతారా అని ప్రశ్నించారు. సంజయ్కి దమ్ముంటే గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలని ప్రధానిపై కొట్లాడాలి, లేకుంటే బీజేపీకి మేం డెడ్లైన్లు పెడతామని జగ్గారెడ్డి పేర్కొన్నారు.