డిమాండ్ ఉన్న పంటలనే వేయాలి: జగదీశ్రెడ్డి
ABN , First Publish Date - 2020-05-31T08:15:08+05:30 IST
మూస వ్యవసాయంతో ఉపయోగం ఉండదని, డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తేనే లాభసాటి ధర లభించి, రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశముంటుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
నియంత్రిత సాగుతోనే లాభాలు: ప్రశాంత్రెడ్డి
ఆరేళ్లలో అన్నదాతకు భరోసా: పువ్వాడ
(ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్): మూస వ్యవసాయంతో ఉపయోగం ఉండదని, డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తేనే లాభసాటి ధర లభించి, రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశముంటుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. పంటకు ధర నిర్ణయించుకునే స్థాయికి రైతులను తీసుకురావటమే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్నగర్లో సమగ్ర వ్యవసాయ కార్యాచరణపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట మార్పిడి చేస్తేనే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందన్నారు. అధిక లాభాల కోసం నియంత్రిత సాగు విధానాన్ని చేపట్టాలని మంత్రి ప్రశాంత్రెడ్డి రైతులకు సూచించారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండ లం అచ్చంపేటలో రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. జుక్కల్లో పత్తి, కందుల పంటల సాగును పెంచాలని చెప్పారు. రైతుల కోసం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆరేళ్లలో తమ ప్రభుత్వం రైతులకు ఎంతగానో భరోసా కల్పించిందని చెప్పారు.