తెలుగు వారికి రైల్వే ఉద్యోగాల్లో అన్యాయం
ABN , First Publish Date - 2020-12-15T09:06:36+05:30 IST
రైల్వే ఉద్యోగాల భర్తీలో తెలుగు వారికి అన్యాయం జరుగుతోందని ఆంధ్రా మేఽధావుల వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. ప్రొఫెసర్ జి.
ఆంధ్రా మేధావుల వేదిక
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రైల్వే ఉద్యోగాల భర్తీలో తెలుగు వారికి అన్యాయం జరుగుతోందని ఆంధ్రా మేఽధావుల వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. ప్రొఫెసర్ జి.అప్పలనాయుడు అధ్యక్షతన సోమవారం వేదిక వర్చువల్ సమావేశం జరిగింది. రెండు తెలుగు రాష్ర్టాల్లో 58 మంది, ఇతర రాష్ర్టాల్లో మరో ఆరుగురు ఎంపీలు తెలుగు వారున్నారని.. దేశంలో తెలుగు వారికి జరుగుతున్న అన్యాయంపై వారు స్పందించాలని వేదిక కోరింది.
వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. 13 కోట్ల జనాభా ఉన్న తెలుగు వారి కోసం రైల్వే ఉద్యోగాల పరీక్షలను తెలుగులో ఎందుకు నిర్వహించరు? అని ప్రశ్నించారు.