ఓటరు నమోదు గడువు పెంచండి:
ABN , First Publish Date - 2020-11-03T08:11:29+05:30 IST
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువు పొడిగించాలని పలు పార్టీల ప్రతినిధులు రాష్ట్ర
విపక్షాలు
హైదరాబాద్/రాంనగర్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువు పొడిగించాలని పలు పార్టీల ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయెల్కు సోమవారం వినతి పత్రం అందించారు. ఎన్నికల సంఘం ఓటరు నమోదుకు నవంబరు 6 వరకు గడువు నిర్ణయించిందని, అయితే అక్టోబరులో కురిసిన భారీ వర్షాలు, వరదలతో తెలంగాణలో ఓటరు నమోదుకు ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు.
ఓటరు నమోదులో నెలకొన్న సాంకేతిక లోపాలు, రాష్ట్రంలో ప్రకృతి విపత్తుల వల్ల చాలా మంది ఓటు నమోదు చేసుకోలేదని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, సీపీఎం రాష్ట్ర నాయకుడు డీజీ. నర్సింహారావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్రెడ్డి, టీడీపీ నేత జ్యోత్స్న తదితరులు ఆయా పార్టీల నేతలతో ఎన్నికల అధికారిని వేర్వేరుగా కలిశారు.