నాపై దాడి కాదు.. హత్యాయత్నం జరిగింది
ABN , First Publish Date - 2020-12-03T07:40:04+05:30 IST
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ రోజున బీజేపీ కార్యకర్తలు తనపై దాడి చేయడమే కాకుండా చంపేందుకే ప్రయత్నించారని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ

బీజేపీ చర్యను ఎందుకు సమర్ధించారో సీపీఐ నారాయణ సమాధానం చెప్పాలి : మంత్రి పువ్వాడ
ఖమ్మం, డిసెంబరు 2(ప్రతినిధి): జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ రోజున బీజేపీ కార్యకర్తలు తనపై దాడి చేయడమే కాకుండా చంపేందుకే ప్రయత్నించారని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. ఖమ్మంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్లోని మమత ఆస్పత్రి నుంచి తాను వెళుతుంటే బీజేపీ కార్యకర్తలు తన కాన్వాయ్లో ఉన్న కారును అడ్డగించి దాడిచేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. దాడితోపాటు హతమార్చేందుకు చూశారని ఆరోపించారు.
తాను డబ్బులు పంచడానికి వచ్చానని బీజేపీ దుష్ప్రచారం చేసిందన్నారు. దుబ్బాకలో మాదిరి గోబెల్స్ ప్రచారంతో లబ్ధి పొందాలని ప్రయత్నించినా అది వికటించిందన్నారు. బీజేపీ దాడిచేస్తే సీపీఐకి చెందిన చికెన్ నారాయణ ఎందుకు సమర్ధించారో సమాధానం చెప్పాలన్నా రు. ఆయన బీజేపీలో కొత్తగా ఎప్పుడు చేరారో అర్థం కావడంలేదన్నారు.