‘జ్యుడీషియల్’ నియామకాలపై సర్కార్తో మాట్లాడతా..: జస్టిస్ రాజశేఖర్రెడ్డి
ABN , First Publish Date - 2020-03-02T09:12:58+05:30 IST
కోర్టుల్లో ఖాళీల భర్తీపై ప్రభుత్వంతో మాట్లాడి.. త్వరలోనే నియామక ప్రక్రియ మొదలుపెడతామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్రెడ్డి...

కోర్టుల్లో ఖాళీల భర్తీపై ప్రభుత్వంతో మాట్లాడి.. త్వరలోనే నియామక ప్రక్రియ మొదలుపెడతామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్రెడ్డి తెలిపారు. జ్యుడీషియల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో ఆదివారం జరిగిన జిల్లా జ్యుడీషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఆలిండియా జ్యుడీషియల్ ఎంప్లాయిస్ కాన్ఫఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన బోధ లక్ష్మారెడ్డిని జస్టిస్ రాజశేఖర్రెడ్డి సన్మానించారు.