ఉపరితలమే పదిలం

ABN , First Publish Date - 2020-08-22T09:17:02+05:30 IST

ఎడమ గట్టు ప్రాజెక్టుతో పోల్చితే ఏపీ జెన్‌కో నిర్వహిస్తున్న జలవిద్యుదుత్పత్తి కేంద్రం భద్రమైనదని ఇంజనీర్లు

ఉపరితలమే పదిలం

150 అడుగుల్లోనే కుడిగట్టు టర్బైన్లు.. ప్రమాదాలపై  స్పందనకు వీలు

1.5 కిలోమీటర్ల లోతున ఎడమగట్టు.. వేగంగా వ్యాపించిన మంటలు


ఆంధ్రజ్యోతి, కర్నూలు: ఎడమ గట్టు ప్రాజెక్టుతో పోల్చితే ఏపీ జెన్‌కో నిర్వహిస్తున్న జలవిద్యుదుత్పత్తి కేంద్రం భద్రమైనదని ఇంజనీర్లు చెబుతున్నారు. ఎందుకంటే, ఎడమగట్టు ప్లాంటు భూగర్భంలో ఉంది. భూమి నుంచి దాదాపు ఒకటిన్నర - రెండు కిలోమీటర్ల లోతులో టర్బయిన్లు ఉన్నాయి కుడిగట్టు ఉపరితల ప్లాంటు. ఇందులో టర్బయిను 150 అడుగులలోనే  ఉన్నాయి. మూడేళ్ల క్రితం కుడిగట్టు ప్లాంట్‌లో మంటలు వచ్చినా వెంటనే  ఆర్పివేశారు. నాడు ప్రాణ నష్టం లేదు. స్వదేశీ సాంకేతికత పరిజ్ఞానంతో నిర్మితమైన ఈ కేంద్రంలో ఏ చిన్నపాటి సాంకేతిక సమస్య ఎదురైనా సైరన్ల ద్వారా సంకేతాలు వెళ్తాయి. సమస్య ఎక్కడో తక్షణమే తెలుసుకోవచ్చు.    

Updated Date - 2020-08-22T09:17:02+05:30 IST