సొంతూళ్లకు విద్యార్థులు వెళ్లేందుకు డీజీపీ అనుమతి

ABN , First Publish Date - 2020-03-25T23:51:36+05:30 IST

సొంతూళ్లకు విద్యార్థులు వెళ్లేందుకు డీజీపీ అనుమతి

సొంతూళ్లకు విద్యార్థులు వెళ్లేందుకు డీజీపీ అనుమతి

హైదరాబాద్: కరోనా వైరస్ ప్రభావంతో అధికారులు నగరంలో భారీ భద్రతతో పాటు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో నగరంలోని హాస్టల్ యజమానులు విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు. అమీర్ పేట, పంజాగుట్ట, మాదాపూర్, బాలనగర్ తో పాటు పలు ఏరియాల్లో హాస్టల్స్ నుంచి విద్యార్థులను పంపిచేస్తున్నారు. దీంతో మేము ఎక్కడికి వెళ్లాలని ఆందోళనకు దిగిన విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు. తమ సమస్యను పరిష్కరించాలని పోలీసులను వేడుకున్నారు. అయితే విద్యార్థుల ఆందోళనపై డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. హైదరాబాద్‌ నుంచి ఊర్లకు వెళ్లేందుకు విద్యార్థులకు అనుమతి ఇచ్చారు. సొంత వాహనాలు ఉంటేనే అనుమతి ఇస్తామని డీజీపీ తెలిపారు. అత్యవసరమైతే స్థానిక పోలీసులు అనుమతి ఇస్తారని చెప్పారు. ఉద్యోగులకు కంపెనీలే వాహనాలు ఏర్పాటు చేయాలని డీజీపీ సూచించారు. 


ఎలాంటి ఆటంకం లేకుండా స్వగ్రామలకు వెళ్లేలా పోలీసులు పాసులు మంజూరు చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో చెక్‌పోస్ట్‌ల వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా విద్యార్థులు తమ తమ స్వస్థలాలకు వెళ్లేలా పాసులు మంజూరు చేశామని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. 

Updated Date - 2020-03-25T23:51:36+05:30 IST