రేపటి నుంచి హైకోర్టులో అన్ని కేసుల విచారణ

ABN , First Publish Date - 2020-05-17T13:25:33+05:30 IST

లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తామంటూ గతంలో ఇచ్చిన సర్క్యులర్‌లను హైకోర్టు సవరించింది.

రేపటి నుంచి హైకోర్టులో అన్ని కేసుల విచారణ

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తామంటూ గతంలో ఇచ్చిన సర్క్యులర్‌లను హైకోర్టు సవరించింది. ఈ నెల 18 నుంచి అన్ని కేసులూ విచారించనున్నట్లు తెలిపింది. ఆయా కేసులను వీడియో కాన్ఫరెన్సు ద్వారా అన్ని పనిదినాల్లో విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. రిట్లు, క్రిమినల్‌, సివిల్‌ కేసుల ఈ-ఫైలింగ్‌ కోసం హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపర్చారు. 

 

Updated Date - 2020-05-17T13:25:33+05:30 IST