ద సన్ ఆఫ్ తెలంగాణ పుస్తకాన్ని ఆవిష్కరించిన హోం మంత్రి

ABN , First Publish Date - 2020-12-27T23:11:57+05:30 IST

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ బయోగ్రఫీని ఆధారం చేసుకుని సీనియర్ జర్నలిస్ట్ రియాజ్ అలీ రజ్వి రచించిన " ద సన్ ఆఫ్ తెలంగాణ " పుస్తకాన్ని

ద సన్ ఆఫ్ తెలంగాణ పుస్తకాన్ని ఆవిష్కరించిన హోం మంత్రి

హైదరాబాద్: రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ బయోగ్రఫీని ఆధారం చేసుకుని సీనియర్ జర్నలిస్ట్ రియాజ్ అలీ రజ్వి రచించిన " ద సన్ ఆఫ్ తెలంగాణ " పుస్తకాన్ని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు.ఆదివారం గన్ ఫౌండ్రి లోని మీడియా ప్లస్ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో వినోద్ కుమార్ తో కలిసి హోం మంత్రి మహమూద్ అలీ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.


తెలంగాణ ముస్లిం మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డా. మసూద్ జాఫ్రీ అధ్యక్షతన జరిగినఈ కార్యక్రమంలో కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ వై. సునీల్ రావు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు సీ. విఠల్,  ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉర్దు విభాగం రిటైర్డ్ అధిపతి డా. మజీద్ బెదర్, పుస్తక రచయిత మహమ్మద్ రియాజ్ అలీ రజ్వి, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-27T23:11:57+05:30 IST