సిద్దిపేట ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయండి!

ABN , First Publish Date - 2020-11-13T09:14:48+05:30 IST

దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా సిద్దిపేటలో జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే రఘునందన్‌రావు హైకోర్టును ఆశ్రయించారు.

సిద్దిపేట ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయండి!

హైకోర్టులో ఎమ్మెల్యే రఘునందన్‌ పిటిషన్‌

దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా సిద్దిపేటలో జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే రఘునందన్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. రూ.18 లక్షలు లభించాయంటూ పోలీసులు కట్టు కథ అల్లి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని, దానిని కొట్టివేయాలని క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిని విచారించిన జస్టిస్‌ లక్ష్మణ్‌ బెంచ్‌.. ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులపై సీజే ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుందని తెలిపింది. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది


Updated Date - 2020-11-13T09:14:48+05:30 IST