ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు రోజువారి విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశం
ABN , First Publish Date - 2020-10-03T22:36:54+05:30 IST
ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు రోజువారి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ జరపాలని కోర్టు పేర్కొంది.
![ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు రోజువారి విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020100304350566/10032020170647n67.jpg)
హైదరాబాద్: ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు రోజువారి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ జరపాలని కోర్టు పేర్కొంది. సీబీఐ, ఏసీబీ, ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులు విచారిస్తున్న ప్రత్యేక కోర్టులకు హైకోర్టు ఆదేశించింది. నవంబరు 6 వరకు కోర్టులు అనుసరించాల్సిన అన్లాక్ విధానాన్ని హైకోర్టు ప్రకటించింది. హైకోర్టులో విచారణలు ప్రస్తుత విధానంలోనే కొనసాగించాలని న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. జిల్లాల్లో కోర్టులు తెరిచి భౌతిక విచారణ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.