దిశ ఎన్‌కౌంటర్ చిత్రంపై నేడు హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2020-11-06T14:49:22+05:30 IST

హైదరాబాద్: దిశ చిత్రంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. చిత్రాన్ని నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

దిశ ఎన్‌కౌంటర్ చిత్రంపై నేడు హైకోర్టులో విచారణ

హైదరాబాద్: దిశ చిత్రంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. చిత్రాన్ని నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాం గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న దిశ ఎన్‌కౌంటర్ చిత్రాన్ని వెంటనే ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌పై అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతున్నారు. వాటిని తొలగించాలని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు శ్రీధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దిశ ఎన్‌కౌంటర్ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఇప్పటికే సుప్రీం జ్యుడీషియల్ కమిషన్‌కు సినిమాను ఆపాలని నిందితుల కుటుంబ సభ్యులు పిర్యాదు చేశారు. నేడు మరో మారు హైకోర్టులో విచారణ జరగనుంది.

Updated Date - 2020-11-06T14:49:22+05:30 IST