జర్నలిస్టులకు ఏపాటి సాయమిచ్చారు?: హైకోర్టు

ABN , First Publish Date - 2020-05-13T10:06:24+05:30 IST

జర్నలిస్టులకు ఏపాటి సాయమిచ్చారు?: హైకోర్టు

జర్నలిస్టులకు ఏపాటి సాయమిచ్చారు?: హైకోర్టు

మిర్యాలగూడ అర్బన్‌, మే 12: కరోనా నేపథ్యంలో జర్నలిస్టులను ఆదుకోవాలని కోరుతూ నల్లగొండ జిల్లాకు చెందిన న్యాయవాది రాపోలు భాస్కర్‌ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయసహకారాలపై పూర్తిస్థాయి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌కు హైకోర్టు నోటీసులిచ్చింది. పిటిషనర్‌ తరఫున  సీనియర్‌ న్యాయవాది మాచర్ల రంగయ్య వాదించారు. లాక్‌డౌన్‌ సమయంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. జర్నలిస్టు కుటుంబాలకు రూ.25వేల ఆర్థిక సహాయం అందించడంతోపాటు హెల్త్‌ ఇన్సూరెన్స్‌, మెడికల్‌ కిట్లు, మాస్కులు ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

Read more