వరంగల్ జిల్లా: ఏజన్సీ ప్రాంతాల్లో హై అలెర్ట్
ABN , First Publish Date - 2020-09-06T17:56:33+05:30 IST
భూటకపు ఎన్ కౌంటర్లకు నిరసనగా ఆదివారం మావోయిస్టులు బంద్కు పిలుపు ఇచ్చిన..
![వరంగల్ జిల్లా: ఏజన్సీ ప్రాంతాల్లో హై అలెర్ట్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
వరంగల్ జిల్లా: భూటకపు ఎన్ కౌంటర్లకు నిరసనగా ఆదివారం మావోయిస్టులు బంద్కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజన్సీ ప్రాంతాల్లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. మూడు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల మండలం, దేవళ్ళ గూడెం ఎన్కౌంటర్లో శంకర్ అనే మావోయిస్టు యాక్షన్ టీం మెంబర్ని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చి చంపారు. శంకర్ ఎన్కౌంటర్ బూటకమంటూ, బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా మావోయిస్టు పార్టీ బంద్కు పిలుపిచ్చింది.