హేమంత్ హత్యపై తల్లిదండ్రులు ఏమంటున్నారంటే..
ABN , First Publish Date - 2020-09-25T18:12:43+05:30 IST
హైదరాబాద్: హైదరాబాద్లో జరిగిన పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
హైదరాబాద్: హైదరాబాద్లో జరిగిన పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తమ కుమారుడి హత్యపై హేమంత్ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ప్రేమ పెళ్లిని అవంతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు హేమంత్ తండ్రి వెల్లడించారు. పోలీసుల సమక్షంలో రాజీ కుదుర్చుకున్నామన్నారు. గతంలో అనేకసార్లు హేమంత్ను బెదిరించారని హేమంత్ తండ్రి తెలిపారు. కుల పిచ్చితో హేమంత్ను చంపించారని అతని తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. హేమంత్ను చంపిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.