తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక
ABN , First Publish Date - 2020-08-22T23:41:11+05:30 IST
ఏపీ, తెలంగాణను వర్షాలు వీడట్లేదు. విశాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖ రెండు రాష్ట్రాలకు శని, ఆదివారం వర్ష సూచనలు...
హైదరాబాద్: ఏపీ, తెలంగాణను వర్షాలు వీడట్లేదు. విశాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖ రెండు రాష్ట్రాలకు శని, ఆదివారం వర్ష సూచనలు చేశాయి. తూర్పు మధ్యప్రదేశ్ లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమదిశగా పయనిస్తోంది. అటు రాజస్థాన్ లోని కోటా నుంచి ద్రోణి బాలాసోర్ మీదుగా ఈశాన్య బంగాళాఖాతం వరకూ విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. శని, ఆదివారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.