కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం
ABN , First Publish Date - 2020-03-23T10:45:18+05:30 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు ఈదురుగాలతో భారీ వర్షం కురిసింది. కరకగూడెం మండలంలో సుమారు 200 ఎకరాల్లో మిర్చి
![కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
200 ఎకరాల్లో మిర్చి పంట నీటిపాలు
కొత్తగూడెం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు ఈదురుగాలతో భారీ వర్షం కురిసింది. కరకగూడెం మండలంలో సుమారు 200 ఎకరాల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. మణుగూరు, అశ్వాపురం, పినపాక, కరకగూడెం, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, ఇల్లెందు, టేకులపల్లి, తదితర మండలాల్లో వాన కురిసింది. ఆయా ప్రాంతాల్లో పిడుగులు పడ్డట్టు సమాచారం. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసి ముద్దయింది.