ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

ABN , First Publish Date - 2020-08-01T11:16:41+05:30 IST

పోలీసు సిబ్బంది ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఇన్‌చార్జి సీపీ ప్రమోద్‌కుమార్‌ సూచించారు

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

ఇన్‌చార్జి సీపీ ప్రమోద్‌కుమార్‌


వరంగల్‌ అర్బన్‌ క్రైం, జూలై 31:  పోలీసు సిబ్బంది ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఇన్‌చార్జి సీపీ ప్రమోద్‌కుమార్‌ సూచించారు. ఉద్యోగ విరమణ పొందిన సిబ్బందిని శుక్రవారం కమిషనరేట్‌ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ చేతుల మీదుగా సిబ్బందికి గృహోపకరణాలు అందించారు. ఉద్యోగ విరమణ పొందినవారిలో ఎస్‌ఐలు సుదర్శన్‌రెడ్డి, కమళాకర్‌, లక్ష్మారెడ్డి, ఏఎ్‌సఐలు అశోక్‌, వెంకన్న, శ్రీనివా్‌సరావు, ఈశ్వర్‌సింగ్‌, హెడ్‌కానిస్టేబుల్‌ నర్సింగరావు, కానిస్టేబుల్‌ కమురయ్య ఉన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీలు పాక గిరిరాజు, భీంరావు, వెల్ఫేర్‌ అధికారి భాస్కర్‌, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-01T11:16:41+05:30 IST