హెచ్‌సీయూ ప్రొఫెసర్‌కు అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2020-09-12T11:54:44+05:30 IST

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ఆర్‌.చంద్రశేఖర్‌కు అరుదైన గౌరవం లభించింది.

హెచ్‌సీయూ ప్రొఫెసర్‌కు అరుదైన గౌరవం

హైదరాబాద్/గచ్చిబౌలి : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ఆర్‌.చంద్రశేఖర్‌కు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచవ్యాప్తంగా పరిశోధన విద్యార్థులు సమర్పించే పత్రాలను ప్రచురించే జర్నల్‌ పత్రిక రాయల్‌ సొసైటీ ఆఫ్‌ కెమిస్ట్రీ (ఆర్‌ఎ్‌సఈ) ఇంటర్నేషనల్‌ ఎడిటోరియల్‌ అడ్వైజరీ బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. మెటీరియల్‌ అడ్వాన్‌సె్‌స పేరిట ఆర్‌ఎ్‌సఈ ప్రచురించే జనరల్‌ ఎడిటోరియల్‌ బోర్డు సభ్యుడిగా ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌ సేవలు అందించనున్నట్లు వర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం వర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు.

Updated Date - 2020-09-12T11:54:44+05:30 IST